పొద్దునే లేవడం యెంత కష్టమైనా, ఎలాగోలా బైలుదేరాం. బస్సు యెక్క గానే మా మిత్రుడు మంచి నిద్ర లోకి జారుకున్నాడు. నాకెందుకో నిద్ర పట్టలేదు.ఈ యాత్ర గురించి ఏంటో కొంత గూగుల్ చేసిన కారణం గా నేమో, అవీ ఇవీ గుర్తొచ్చి కొంచెం excite అయ్యాననే చెప్పొచ్చు. బెంగలూరు దాటాక కనబడ్డ దృశ్యాలు నన్ను నిరాస పరచ లేదు. చుట్టూ అనంత దూరం వరకు పరచుకున్న పచ్చదనం,పొలాలు, చిన్ని చిన్ని గ్రామాలు, కొబ్బరి పోక చెట్ల అంతర సేద్యం అదేదో ప్రణాలికా బద్ధం గా గుంజలు పాటి నట్టు. ఈ పచ్చదనం మద్య పాకి పోతున్న పాము లాగ రోడ్డు, అంటూ పొంతూ లేక సాగుతుంది. రోడ్డు కిరువైపులా బ్రంహాండమైన వృక్షాలు గ్రామ పెద్దలు మనలను ఆహ్వానిస్తున్నట్టున్నాయి.
శ్రావణ బెలగోల సమీపించే కొద్ది, dieting చేసి సన్న బడ్డ అమ్మాయి లా చిక్కింది రోడ్డు. మరీ పక్కింటి దొడ్లోనుండి పోతున్నట్టు సాగింది ప్రయాణం.ఊర్లో ప్రవేసించ గానే కల్యాణి (కోనేరు) స్వగతం పలికింది. పక్కనే కొండ పైకి మెట్ల దారి. ౫౦౦-౬౦౦ మెట్లే కదా అని ఘీన్కరించిన మహానుభావులు సగం దారి లోనే కూలబడ్డారు.వాళ్ళలో నేను ఒకన్నాను కొండి. కొండ లోనే జన్మించాయా అన్నట్టు, సహజ సిద్దం గా ఉన్నాయి మెట్లు. బాహుబలి విగ్రహం స్వచ్చమైన చిరునవ్వు తో మా అలసట మాయమైంది. ప్రాపంచిక విషయాలతో నాకు పనిలేదన్నట్టు, ఊరికి దూరం గా శిఖరాగ్రాన నిలిచి ఉన్న ఏకశిలా విగ్రహం ఆనాటి స్మృతులు నేమరేసుకున్నట్టుంది.
౧౭ మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహానికి రోజు అభిషేకం జరుగదట, ఉత్సవ విగ్రహాని కే ఆ భాగ్యం.భరతుడిని యుద్ధం లో ఓడించిన బాహుబలి, ప్రాపంచిక విషయాలకు విరక్తుడై, ఈ కొండ పై తపస్సు చేసి విముక్తుడైనాడని స్తల పురాణం.గంగా సామ్రాజ కాలం లో (౧౧ శతాబ్దం) ప్రతిష్టించిన ఈ విగ్రహం నేటికి అబ్బురపరుస్తుంది.ఎటు వంటి సదుపాయాల్లేని ఆ కాలం లో ఈ విగ్రహ ప్రతిష్ట ఒక చిత్ర మైతే, ఒకే మెట్ల దారి ఉన్న ఈ కొండ పైకి, మహా మస్తకాభిశేక సమయం లో సంబారాలన్ని పైకి చేర వేయటం ఇంకో ఎత్తు అని పించింది.
మా తదుపరి మజిలి హళిబేడు. ఇరు వైపులా చెట్లు కప్పేసాయ అన్నట్టుంది కొన్ని చోట్ల దారి.పచ్చని పొలాల మద్యలో కాపలా గా కొబ్బరి చెట్లు, ఎత్తు పెరగటం లో వాటికి పోటి పడుతున్న పోక చెట్లు, అక్కడక్కడా నిండు ఘర్భినిల్లాంటి అనాస చెట్లు. విశాలమైన పచ్చిక బయళ్ళలో మేస్తున్న పశువులు, సాంప్రదాయ కట్టు బొట్టులతో మగువలు చిన్ననాటి గుర్తులను తట్టి లేపాయి.ఇటు గాలి అటు పోనీ concrete అరాన్యాల నుండి ఇదొక ఆట విడుపు, మనవైన మూలాలలోకి ప్రయాణం.
హళిబేడు అంటే ద్వంసమైన పట్టణం. ద్వారా సాగారమనే హోయసలుల రాజధాని, బహమనీ దురాక్రమణ వల్ల, దంసమైనది కాబట్టి ఆ పేరు వచ్చింది. హొయసలేశ్వర ఆలయం ఒక అద్బుతం.దాదాపు ౧౦౦ ఏళ్ళు కట్టబడ్డ ఈ ఆలయం అసంపూర్తి గానే మిగిలిపోయింది.ఇది సిమెంట్ అనేది ఉపయోగించకుండా అమరిక పద్దతి లో నిర్మించ బడిన విచిత్రం. రెండు ఆలయాల ప్రాకారం అబ్బురపరుస్తింది. ఆలయాల బైట విగ్రహాలు, శిల్ప సౌందర్యం కదల నివ్వవు.హోయసలేస్వరునికి పూజాదికాలు నేటికి జరుగుతున్నాయి.రెండు నందీస్వరులు జీవ కళలతో అలరారు తున్నాయి.ఆలయం బైట దేవతామూర్తులు,రామాయణ ఘట్టాలు ఒక రోజు ఐన వెచ్చించి చూడదగ్గవి. ఏనుగు పొట్టలో శివ తాండవం, కృష్ణుడు గోవర్ధనం ఎత్తడం, లాంటి ఘట్టాలు చెప్పదగ్గవి.అసంపూర్తి గా మిగిలిన ఘట్టాలే ఇలా వుంటే పూర్తి ఐతే ఎలా ఉండేవో అన్న ఊహ రాక మానదు.ఈ ఆలయం చుట్టూ పక్కల హోయసలుల శిల్ప సౌందర్యం తో అలరారే ఆలయాలు ౧౦-౧౫ ఉన్నాయట.
బేలూర్ మా చివరి మజిలి. హోయసలుల మొదటి రాజధాని.౧౧ వ శతాబ్దం లో విష్ణు వర్ధనుని చే నిర్మించబడ్డ, చేన్నకేసవ ఆలయం లో నేటికీ పూజాదికాలు జరగటం విశేషం.విజయనగర కాలం లో ఈ ఆలయం జీర్ణోద్దరణ కాబడింది.చేన్నకేసవ విగ్రహం ౨ మీటర్ల ఎత్తు ఉంటుంది.నిజంగానే సుందరుడు ఈ చెన్న కేస్వవుడు.ఆలయం లోని జయ విజయుల విగ్ర హాలు, స్తంభాల పై, ఆలయం పైభాగం లో శిల్ప కల బేలూర్ ఎందుకంత ప్రసిద్ధి పొందిదో తెలియజేస్తాయి.ఆలయం లో ౪౦ స్తంభాలు దేని కదే ప్రత్యేకం.ప్రతి స్తంభం పై చిత్రకళా చూడదగ్గది.
మొత్తానికి ఈ యాత్ర, విజయనగరానికి పూర్వం విరాజిల్లిన హిందూ సామ్రాజ్యం గురించి మంచి పరిచయం.వివిధ కారణాల వల్ల మనకు వారి గురించి మనకు పెద్ద గా తెలియక పోయినా,హోయసలుల కళాదృష్టి,హిందూ ధర్మోద్దారణ కై వారు నిర్మించిన బ్రహ్మాండమైన ఆలయాలు ఈ నాటికీ వారి గొప్ప తనాన్ని చాటుతున్నాయి.
7:50 సా. వద్ద మే 13, 2010 |
బావుందండీ. ఫోటోలు ఉంటె పెట్టండి 🙂
3:39 ఉద. వద్ద మే 18, 2010 |
maa mitrudu inka pampaledandi..ayana camera lo konni drusya kaavyalunnayi..pampa gaane pedataanu