మేడి పండు మెదళ్ళు…

మార్చి 2, 2010
పొద్దున్నే మన తెలంగాణా జాక్ వాళ్ళు భలే డిమాండ్ చేసారు. ఒక్క కొదందారం( చదివాను, కాని కావాలనే సరిచేయ్యలేదు) ఒక్కడే వీళ్ళలో బుర్ర వాడుతాడు కదా అని టి.వి లో ఆయన ఏదో మాట్లాడుతుంటే విన్నా.విన్నాక అనిపించింది. ఈయనకు fuse పోయింది అని. పక్కనే సినిమాల బంద్ కవితక్క, గజని మొహమ్మద్ ల ఎన్ని సార్లు నిలబడ్డా ఈ మద్య కాలం లో ఒక్క election గెలవలేక చావు తెలివి తో జై తెలంగాణా అంటున్న విద్యాసాగర్.
ఇంతకీ డిమాండ్ ఏమి టంటే, తెలంగాణా ఇంటర్ పేపర్లు తెలంగాణా లో నే రుద్దాలంట. లేక పొతే ఆంధ్ర ఉపాద్యాయులు వీళ్ళని ఫెయిల్ చేస్తారని వీళ్ళ భాద. ఇదెక్కడి విడ్డూరం. కామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా అంటే ఇదేనేమో..సరే, పదవి కోసం ………తినే రాజకీయులు అల అన్నారంటే సరే మరి కొదందారం కి ఏమయ్యింది..బుర్ర కడగ బడ్డ దా లేక..కే.సి.ఆర్. డబ్బుతో కొట్టాడ అయ్యవారిని.ఆయన ఉపాధ్యాయుని  గానే ఉన్నారు కదా..రేపో ఎల్లుండో రిటైర్ అయ్యే లా ఉన్నాడు. మరి అయ్యవారు కూడా ఆంధ్ర విద్యార్దులని పని గట్టు కొని ఫెయిల్ చేసేవార?? మరి లేకుంటే ఈ ఆలోచేనలేల వచ్చాయి. ఈ గుంపు లో ఒక్క చుక్కా రామయ్య ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు. తెలంగాణా మీద ఆయన అలోచెనలు పక్కనెడితే సహభాష్ అనిపించుకున్నాడు.
అయ్యా…ఉపాద్యాయ  వృత్తి ఇంకా అంత దిగజారలేదు..మీవంటి మేడిపండు మెదళ్ల సాయం ఇక్కడేవరికి అక్కర్లేదు. నేను కొన్నేళ్ళు ఉపాద్యాయ వృత్తి లో ఉన్నాను..ఎక్కడైనా ౧-౨ మార్కులు తగ్గితే పేపర్ మొత్తం వెతికి ఎక్కడ ఆ మార్కులు కలిపితే విద్యార్ధి పాస్ అవుతాడు  అని చూసే వాళ్ళను చూసా కాని ఇలా ఆలోచించే వాళ్ళను మిమ్మల్నే చూసాను. ఇందులో తెలంగాణా ఆంధ్ర ప్రస్తావనే లేదని మనవి. ఇంకా మీకు అలా అనిపిస్తుంటే, ఒక్క సారి ఫెనొఎల్ తో మెదడు కడుక్కోవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది.
ఇలాంటి వెర్రి మొర్రి అలోచేనలతో డిమాండ్ ల తో జనం లో ఉన్న కొంచెం సానుభూతి జాక్ కోల్పోతుంది.. జనం వీళ్ళను గుర్తెరిగి తన్ని తరమేసే కాలం ఎంతో కాలం లేదు. ఆ కాలం త్వరలో రావాలని ఆశిస్తూ..జై తెలుగు తల్లి..

ఆంధ్ర ప్రదేశ్–ఒక పిచ్చి వాళ్ళ స్వర్గం

మార్చి 2, 2010
ఒక సారి ఆలోచించండి…ఆలోచనే వెరైటీ గ ఉన్నా, అక్కడ జరుగుతుంది అదే…కారణాలు,ఉద్దేశాలు ఏవైనప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిచ్చి..కోస్తా రాయలసీమలలో నాయకులు సమైక్య ఆంధ్ర గోల..ఈ మద్య కొంచెం తగ్గారు కాని, మొన్నటిదాకా బస్సులు, రైళ్ళు ఆపేసి నారు. విచిత్రం ఏమిటంటే ఈ తెలంగాణా statement ముందు అందరు అధిష్టానం ఆదేశాలు పాటిస్తాం అని శపధాలు  చేసేసినోల్లె. అమావాస్య కి పౌర్ణమి కి టి.జి. లాంటి వాళ్ళు వేర్రేతినట్టు మాకో రాయలసీమ కావలోచ్ అని అరిసేస్తుంటారు. సోమిరెడ్డి మరియు ఆనం అన్నదమ్ములు మొన్నటిదాకా సోనియమ్మ అని..ఇప్పుడు ఇంకొటేదో  అంటున్నారు..ఇక సందట్లో సడేమియా లా ఆమంచి లాంటి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు..
ఇంకాస్త పైకొస్తే లగట పాటి ఇప్పుడేదో లక లక లక అంటున్నారు కాని ఈ తెలంగాణా నిర్ణయం ఆయనకు ముందు నుంచి తెలీద అనేది ఒక నూరు పైసల ప్రశ్న…మరి ఈ లోల్లేదో ముందు నుంచి చెయ్యొచ్చు గంద…అదేదో కే.సి.ఆర్ దీక్ష గురించి పెద్ద ప్రకటనలు చేసి ఈ యన గారు చేసిందేమిటో ఆంధ్ర అంటా తెలుసు…చిరంజీవి ఇప్పుడేదో అంటున్నాడు గాని సామాజిక తెలంగాణా అని గ్రాండ్ గ మానిఫెస్టో లో పెట్టింది ఆయనే గంద…ఇక వసంత, హరి రామ జోగయ్య లాంటి వాళ్ళదో లోకం…ఇక బొత్స గారికి మొన్న కలలో ఆంధ్ర CM కుర్చీ కనపడ్డట్టుంది…మాస్టారు యమ అర్జెంటు గ  U turn తీసుకున్నారు..ఆ అదేదో ఇస్తే తప్పేంటి అని ప్రకటించేశారు.
ఇక తెలంగాణా కొస్తే, చిన్చేస్తం ఆరేస్తాం అని కేకలేసిన కాంగ్రెస్ వాళ్ళు టి.డి.పీ వాళ్ళు రాజీనామా దగ్గరికొచ్చేటప్పటికి అబ్బే మేమలా ఆనలే అని తప్పుకున్నారు.. ముందు నుంచి అందరు రాజీనామా చేసేయండి గొంతులు కోస్కోండి అని అరిచి గీ పెట్టిన కే.సి.ఆర్, రాములమ్మలు రాజీనామా లలో కాసి మజిలి కధలు రాసి పంపారు…జాక్ వాళ్ళు ఇంకో గందరగోళం లో ఉన్నారు….పండగలకి పబ్బాలకి తెలంగాణా రంగులేసేస్తున్నారు…ఎక్కువ మాట్లాడితే మీ అస్తులు లేక్కేసేస్తాం అని ఫర్మానాలు ఇంస్తున్నారు..మజ్లిస్ వాళ్ళకి కే.సి.ఆర్ కి లెక్కల్లో తెడలోచ్చాయో…లేక తెలంగాణా వస్తే అన్న కే.సి.ఆర్ చేక్రం తిప్పుతాడనుకున్నారో గాని  ఈ పౌర్ణమి కి వాళ్ళు సమైక్యంద్ర కే వోటు వేస్తున్నారు…బాబు గారేమో ఏమి అడిగిన బిత్తర చూపులు చూస్తున్నారు..మన బియ్యం గో డౌన్ గుమస్తా గారు అన్ని చూస్తున్నారు…ఏమన్నా అడిగితె నాకేమి తెలీదు అంటున్నారు……
ఇన్ని చెప్పిన ఇంకా ఆంధ్ర కేల్తున్నారా..జరా బద్రం సారూ..

మా తెలుగు తల్లికి మల్లెపూదండ….

ఫిబ్రవరి 22, 2010
లీడర్ మూవీ బానే ఉందని ఎవరో అన్నారు పొద్దున్న…శేఖర్ కమ్ముల మార్క్ మ్యూజిక్ expect చేస్తూ, ఇంటర్నెట్ లో  ఈ పాట విన్నాను..ఎందుకో ఎక్కడో చిన్న బాధ…ఒక ఆవేశం, కళ్ళకో చెమ్మ వచ్చేంత తెలీని ఫీలింగ్…ఒక సారి శంకరంబాడి  ని స్మరించుకోవాలి అనిపించి ఈ బ్లాగ్ రాస్తున్నాను…పక్కనే ఎవరో ఇదేదో చాల పాత మూవీ లోంచి remix  చేసినట్టునారు అని అడిగారు…మన దౌర్భాగ్యాన్ని  ని జంధ్యాల తిట్ల దండకం తో కడిగి పారేసిన సుఖం లేదేమో…
ఆ గీతం గీతకన్న పావనం …తల్లి ని గౌరవించిన ఒక అసలు సిసలు తెలుగోడి మనసు లోంచి పుట్టిన  పారిజాతం….ఆపాతమధురం…చిరస్మరణీయం..కనుచూపులో కరుణ నిండిన ఆ తల్లి తన గోదావరి కృష్ణ  స్తన్యధారలతో తన పిల్లలను పోషిస్తుంది..మురిపాలు పంచుతుంది..
ఈ గీతం ఒక్కటి చాలేమో తెలుగోడి చరిత్ర మొత్తం తెలుసుకోడానికి…అమరావతి నగర అపురూప శిల్పాలు మన చరిత్రకు వైభవానికి చిహ్నాలు..త్యాగయ్య గొంతులో తారడిన నాదాలు పక్క రాష్ట్రం లో నుండి విశ్వమంతా తెలుగు వెలుగులు పంచాయి..తిక్కన కలములోని తేట తెలుగు ధారలు అజరామరమై నిలిచాయి..రుద్రమ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి…
మా చెవుల రింగు మని మారు మొగేదాక నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం…
ఏమో…ఈ కాలం లో ముప్పాతిక మంది పిల్లలకు కాన్వెంట్ల దెబ్బకు తెలుగే రాని పరిస్తితి..ఇంకా తెలుగు లో పాటలు కూడానా…ఉట్టికి ఎగరలేనమ్మ చందం…మనోళ్ళకు ఆదివారం కూడా ఒక్క పూట సెలవు దొరుకుతుందో లేదో..ఆటలు కూడానా..
తెలుగు తల్లి నే తన్ని తరిమేసిన కొడుకులున్న కాలం..అన్న దమ్ముల్లా విడిపోదాం అని చెప్పే మేధావులు, సవతి తల్లులను సృష్టించే సమయం..బిడ్డలు ఆస్తి పంపకాలు చేసుకోవడం చూసాం కాని, మారు  తల్లుల్ని పుట్టించడం మనోల్లకే చెల్లు….ఈ వాదం పిడివాదమో , ఇంకోటో తెలీదు కాని, దీని వాళ్ళ వాళ్ళెం సాధించారో..వాళ్ళకన్నా తెలుసో తెలీదో..

ఒక్క మగాడు చిరంజీవి…

ఫిబ్రవరి 20, 2010
ఇన్నాళ్ళకు చిరంజీవి తన లెవెల్ కు తగ్గ పని చేసాడు. పార్టీ పెట్టిన ఇన్నాళ్ళనుండి ఒక్క సహభాష్ అనిపించుకునే పని చేసిన పాపాన పోలేదు. ఒక్క పార్టీ ప్రారంభ సభ తప్ప అన్నకు ఏది కలిసోచ్చినట్టు లేదు. కర్ణుడి చావు కు వేయి కారణాలైతే ముఠా మేస్త్రి పరాజయానికి లక్ష కారణాలు..పార్టీ లో మెగాస్టార్ చరిష్మ కన్నా మెగా మరిది ప్రభావం ఎక్కువై, అమావాస్య చంద్రునిలా దిన దినం క్షీణించి ఊక లో ఈక లా తయారయ్యాడు…..
కాని, ఇప్పుడు చిరంజీవి ని మెచ్చుకోవడానికి బలమైన కారణం ఉంది. తెలంగాణా విషయం లో అదే పనిగా ( బైట చెప్పుకో డానికైనా ) తెలంగాణా విముక్తి కోసం పుట్టిన తే రా సా కు, ఉద్యమాల కన్నా వోట్లు తక్కువ పడే communist పార్టీ లకు ఉన్న స్పష్టత మళ్ళా మెగా స్టార్ కే ఉంది…జాతీయ పార్టీ గా జబ్బలు చరుచుకునే కాంగ్రెస్, భయంకరం గా వేళ్ళూనుకున్న ప్రాంతీయ పార్టీ అని భుజాలు తడుముకునే తే దే పా. , జాతీయ స్తాయిలో ముక్కు పగల గొట్టించుకుని అక్కడక్కడ మెరుపుతీగలా కనపడే భా జ పా లు తెలంగాణా లో తెలంగాణా కు జై అని, సీమ ఆంధ్రల లో సమైక్యవాడులము అని సిగ్గు లేకుండా కండువాలు వేసుకుని తిరుగుతుంటే…మన మెగాస్టార్ కుండ బద్దలు కొట్టేసాడు…
ఇంకా ABVP , ఇంకా ఈ ఆహా ఓహో ధమాల్ దుమేల్ లాంటి తోక సంస్తలు, కోక మండళ్ళ సంగతి సరే సరి…ఏ ఎండ కా గొడుగు సామెత బాగా వంట బట్టించుకున్నారు…అదేమీ విడ్డూరమో కోస్తాలో ఓడ మల్లన్న అన్న పార్టీ లే తెలంగాణా వచ్చేసరికి బోడి మల్లన్న అనేస్తున్నాయి…
అబ్బే చిరంజీవి కి ఇంకా రాజకీయాలు వొంట బట్టలా అని మీరు కొట్టి పారేస్తే పరేయోచ్చు గాక…కానీ, ఈ విషయం లో చిరంజీవి రాష్ట్రం మొత్తం లో ఒక్క మగాడే….

చూపులు దేవుని మీద చిత్తం …….

ఫిబ్రవరి 13, 2010
ఈ మద్య మనోళ్ళంతా మంచోల్లై పోయారు…తెలంగాణా కోసం తల నరుక్కునే వాళ్ళు ఒకల్లైతే ( అబ్బే ఉత్తినే)  తలలు నరుకుతాం అనే వాళ్ళు ఒకళ్ళు…ఉన్నట్టుండి ఈ మద్యనే ఫ్రెష్ గ ఉద్యమం లో చేరి, నాకు వలసిన గౌరవం దక్కట్ట్లేదని వాపోయే వాల్లోకరైతే,  పలానా కులానికి గౌరవం దక్క కుంటే జాక్ గౌరవం దక్కదనే వాళ్ళోకళ్ళు..సరే ఉద్యమం లో ఇవన్ని మామూలే అనుకున్న…అదేదో నాటకం లో చెప్పినట్టు, అందరు మంచోల్లైతే అమ్మవారి మేడలో హారం ఏమైందని…అందరూ మంచోల్లైతే ఎందుకీ గొడవలు…ఇది దైవ రహస్యం..సర్లెండి మన మద్య రహస్యలేందుకు గాని…యినుకోండి…
నేను మంచోడ్ని సూపర్ మాన్ ని అనే కాకా, మొత్తానికి మొన్న బైట పడ్డాడు…అదేదో ప్రాజెక్ట్ కి వై ఎస్ ఆర్ ఆయన పేరు పెడతా అని హ్యాండ్ లో చేయి పెట్టి ప్రామిస్ చేసి మల్ల హ్యాండ్ ఇచ్చిన్దు అని…ఇలాంటి పేర్లు విగ్రహాలు ఎన్ని పెట్టించుకున్నా నువ్వు పోయాక నిన్నెవరు గుర్తుంచుకుంటారు కాకా..మల్ల కొన్నేళ్ళకి నీ పేరు జెప్తే జెనాలు గుర్తు పట్టాల..మల్ల జెప్పుడేందుకు జనాలే నిన్ను తల్చాలే..గట్లాంటి పని ఏమన్నా ఉంటె చేసి పెట్టు…జన్మ కో శివరాత్రి అన్నట్టు…పదవులు కోసమో, మల్ల ఆ ప్రాజెక్ట్ ఈ గవర్నర్ పదవో అని ఒండ్ర పెట్టుటేందుకు..
ఇంకా మన జాన రెడ్డి……మొన్న మద్య ఎవరో తెలంగాణా కోసం రాజీనామా చెయ్యమని ఎవరో నిలదీస్తే అన్న బైట పడిండు…పిచోల్లార ఈ ఉద్యమం యవ్వారం అంతా CM పోస్ట్ కోసమే నాకన్నా ఇంకెవరున్నారు…మల్ల ఇప్పుడు రాజీనామా చేస్తే మల్ల గెలుస్తానో లేదో 😉 అని…అయినా జానన్నా మన కే సి ఆర్ చేతులగ్గిట్ల  గాజులు తొడుక్కున్న డనుకున్నావ్…నీ పిచ్చ గాని మొన్నీ మద్య ఉద్యమం లో కొచ్చి ఇన్ని కళలు కన్తుడవే మరి ఇన్నాళ్ళు వేచి ఉన్న అన్న ఎమవ్వలె..
ఇంకా మన మంద భాగ్యుడు…ఈయన మొన్న జనాల్లో కి ఉద్యమం బాగా ఎక్కే దాక ఆ చుట్టూ పక్కల కనపల్లె…మల్ల ఇప్పుడు వచ్చి నాకు అది కావలె మా వాళ్ళకు ఇది కావలె అని లొల్లి…
యీల్లంతా కల్సి పాపం మన జాక్ ఆచార్యులు కోదండ రామున్ని ఏ మాన్యాలు పట్టిస్తారో అని నా బెంగంతా..వానర మూకె అడవికి పొమ్మంటే ఏమి చేస్తావో కోదండ రామా….

అందితే జుట్టు…అందకుంటే నాలుగు కొట్టు…

ఫిబ్రవరి 11, 2010
ఈ రోజుల్లో ఎవరు తగ్గేటట్టు లేరండి…అక్కడ ముంబై లో చూస్తే మన మరాట మానుస్ ధాకరే కుదుర్తే ముంబై చుట్టూ కంచే ఏర్పాటు చేసి ఇంకెవర్ని రానిచేటట్టు లేరు…ఇంకొన్నాళ్ళు పొతే ముంబై ని ధాకరే వాడి అనో రాజ్ నగర్ అనో మార్చేస్తారేమో…ఈ విపరీత వీర పిచ్చ ప్రవర్తనకి మచ్చుకి కొన్ని లక్షణాలు.. 
౧. పాకి ఆటగాళ్ళను ఐ పీ ఎల్ లో తీస్కోవాలి అన్నందుకు షారుఖ్ సినిమాలు ఆడకూడదు.
౨. ముంబై భారతీయు లందరిది అంటే సచిన్ ముఖేష్ చిదంబరం తదితరులంతా మరాఠా వాళ్ళను ఖూని చేసినట్టు రగడ చేయడం.
౩. ఆస్ట్రేలియా లో జరిగిన అల్లర్లకు ఆ క్రికెటర్స్ ఇండియా లో ఆడకూడదు.
౪. ఇది రాసి నందుకు నేను దొరికితే చదివినందుకు  మీరు మరాఠా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇండియా అంతటికి ద్రోహం చేస్తున్నట్టే.. 😉
ఈ ధోరణి ఎక్కడో మరాఠా వాళ్ళదో ఇంకోల్లదో అని బాగా నవ్వు కుంటున్నారు కాదు…ఇంకా చూస్కోండి…మనోళ్ళు ఇందులో ఏమి తగ్గటం లేదు…నా దారి దొడ్డి దారి బెటర్ డోన్ట్ కం ఇన్ మై వే అనే వాళ్ళు మన రాష్ట్రము లో తక్కువేం  లేరు…మీరు వాళ్ళ అభిప్రాయం కన్నా ఒక్క ముక్క వేరుగా మాట్లాడారా అదేమీ కాదు డిఫరెంట్ గా ఆలోచించారు అంటే మీకు మూడిందన్న మాటే…మచ్చుకి..
౧. హైదరాబాద్ లో ఐ పీ ఎల్  జరక్క పొతే deccan chargers ఆడటం మానెయ్యాలని ఒక మంత్రి గారు వ్రాక్కిచ్చారు…రాజధాని లో గందరగోళాలు ఆపటం చేతకాక ఆడలేక డి జే కి మ్యూజిక్ సెన్స్ లేదు అన్నట్టుంది…
౨. మన ఘనత వహించిన శాసన సభ్యులొకరు శాసన సభ జరగనివ్వం అని డిసైడ్ అయిపోయారు…పేర్లోద్దు లెండి మల్ల అదో లొల్లి…
౩. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆంధ్రా వాళ్ళను హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని ఒక ఆచార్యులు వీది రౌడీ లెక్క ఫర్మాన జారి చేసిండ్రు…
౪. ఇదెంత దూరం పోయిన దంటే ఈ మధ్య జరిగిన కేక లో అసమదీయులే తేడాలు మాట్లాడారని నీళ్ళ ప్యాకెట్ లతో కొట్టుకొనే దాక వెళ్ళింది…పోనిలే అక్కడితో ఆగారు…
అంటే చివరాఖరికి చెప్పేదేమంటే, ఈ దేశం లో ఒక బలవంతుడు ( మీరు పిచ్చి వాడు అని చదువుకోవచ్చు) ఒకటి అనుకోని డిసైడ్ అయిపోయాక దానికి మీరు అణువంత మాత్రం తేడా గా మాట్లాడారో మీకు మూడిందే…అసలు మీకు ఆలోచించే హక్కే లేదు…ఫాలో అయిపోవడమే…బ్రతికుంటే బన్ను తిని బతకచ్చు…ఇంకా మన ప్రజాస్వామ్యం ప్రభుత్వం పోలీసులు అని వెర్రి కలలు కంటున్నారేమో…ఎవరి ………..లు వారివి. ఎక్కువమాట్లాడితే ఎక్కడ వోట్లు సీట్లు వూడి పోతాయో అనే ప్రభుత్వం, అబ్బే నాకేం తెలీదు అనే ముఖ్య మంత్రి,, ప్రాంతాల వారిగా చీలిపోయి తన్నుకు చచ్చే ప్రెస్సు, ఇంకెవరు మిమ్మల్ని కాపాడేది…చచ్చినట్టు ఎవరు ఎదురు పడితే వాళ్లకు జై కొట్టండి…లేదో నా తర్వాత బ్లాగు చదివేదాక ఉంటారో లేదో 😦

రాజు తలచుకుంటే…..

ఫిబ్రవరి 10, 2010
ముస్లిం రిజర్వేషన్స్ గురించి  హై కోర్ట్ , మతపరమైన రిజర్వేషన్స్ కూడదని తీర్పు ఇచ్చింది…కాని మన దేశం లో రాజకీయాలు జన సంక్షేమం వైపు కాక సరిగ్గా వ్యతిరేక దిశలో నడుస్తాయి కాబట్టిన్ను, ఘనత వహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దెబ్బతో ముస్లిం వోట్ బ్యాంకు మరో పది పదిహేనేళ్ళు నిక్షేపంగా కాంగ్రెస్ కే ఉండాలన్న తీవ్ర మైన దీక్ష తో వున్నందుచేతను, ఈ నిర్ణయాన్ని supreme కోర్ట్ లో పెట్టి, అప్పటికీ వీలు కాక పొతే రాజ్యాంగ సవరణ చేయడానికి   భద్దులై ఉన్నట్టు కనబడుతుంది..
   మరి జైనులకు, యూదులకు,బౌద్ధులకు  మన దేశం లో రిజర్వేషన్స్ ఉన్నట్టు లేదు…మరి వాళ్ళు మైనారిటీ లే కదా….అంటే ఇందులో చిదంబర రహస్యం ఏమియును లేదు…వాళ్ళ సంఖ్యా తక్కువ…మరియు వాళ్ళు ఒకటి రెండు తప్ప పెద్దగా ఏ నియోజక వర్గం లో నిర్ణాయక శక్తీ గ లేరు…మరి వాళ్ళకు రిజర్వేషన్ లు ఎలా వస్తాయి…ఇంకొక విచిత్రమైన విషయం ఏమి టంటే, OC  మేల్ category  కి ఇప్పుడు అసలైన రిజర్వేషన్ అవసరం…ఎలా అంటారా…౩౩% ఆడవాళ్ళ రిజర్వేషన్, మిగత ౪౦-౫౦ % మిగత రిజర్వేషన్స్…పోగా, ఇంకా మిగిలేదేమిటి….ఈ నాడు ఒక oC మేల్ category లో కాలేజీ సీట్ సంపాదించాలన్న, ఒక ఉద్యోగం సంపాదించాలన్న హీన పక్షం ఒక సూపర్ మాన్ కావలసినదే…ఈ గోల పడలేక జనం ఆ దేశం ఈ దేశం పట్టి పోవడం లో తప్పు లేదు…తప్పేది లేదు…
               రిజర్వేషన్లు ఏనాడైతే పేదరికాన్ని కొలమానంగా తీసుకోలేదో ఆనాడే పక్కదారి పట్టి నాయి..ఇక వాటిని మరియు మన జనాన్ని అధోగతి పట్టించడం …మన రాజులకు వెన్నతో పెట్టిన పెసరట్టు…

పదండి చింపి పారేద్దాం..రాష్ట్రం లో మరో ఉద్యమ స్ఫూర్తి :)

ఫిబ్రవరి 6, 2010
ఉత్తర భారత దేశం లో జనం అంతా ఆర్యులు, దక్షిణ భారతదేశం లో ని ద్రవిడులు కలిసుండటం సాద్యం కాదు కాబట్టి..దేశం రెండు దేశాలు గ విడి పోతె ఇక వైరుధ్యాలు ఉండవు కావున భలే గా అభివృద్ధి చెందిపోవచ్చని మన  కృష్ణ బాబు  తే దే పా మాజీ ఎమ్మెల్యే గారు డిసైడ్ అయిపోయారు…సరే ఆయన అయిపోయారు అయిపోయిన పెద్దమనిషి ఇంట్లో వాళ్లకు చెప్పి గమ్మునున్నాడా లేదు…ఐన దానికి కాని దానికి మన మీడియా వాళ్ళు ఉన్నారు కదా ఒక ప్రకటన వదిలేసిపారేసారు…
 
వీల్లండి మన ప్రజా ప్రతినిధులు…అదేదో సినిమాలో చెప్పినట్టు, పెళ్లి చెయ్యడం కష్టం కాని చేడకోట్టడం యెంత సేపు ??? ఈ దేశం భిన్నత్వం లో ఏకత్వం మన తత్త్వం అని చాటి చెప్పిన దేశం. ప్రపంచ  దేశాలే ముక్కున వేలేసుకుని చూసేటట్టు కలిసి ఉన్న దేశం. ఈ వైరుధ్యాలు భిన్న భాషలు మతాలు కలిసిన ఇంద్ర ధనుస్సు…నాయన కృష్ణ బాబు…ఏమి తోచక పోతె తోట పని చేస్కో…లేదంటావా ఇప్పటికే చాల విభజన ఉద్యమాలున్నాయి….వాటిలో జనం లేక  భాదపడుతున్నారు…పోయి వాటిలో చేరు…ఇంకా అర్ధం కాక పోతె విశాఖ లోనో ఎర్రగడ్డ లోనో ఒక బెడ్డు ఖాలీ లేక పోదు…

మాయాబజార్ కలర్ లో ( కవితక్క కి చెప్పకండే ;) )

ఫిబ్రవరి 6, 2010

మీరంతా మాయ బజార్ కలర్ లో అని న్యూస్ లో పేపర్ లో చూసే ఉంటారు…యెంత గొప్ప ఆలోచన …కలర్ లో ఆ ఛాయా గ్రహణం, ఆ సెట్టింగ్లు, ఆ ఘటోత్కచ మాయలు ఆహా చూడాల్సిందే కాని చెప్పేది కాదు…నేనైతే మిస్ కాకుండా చూడలనుకుంది సావిత్రి ని, ఏంటి ఓడిని, మన ఎస్వీఆర్ ని…ముగ్గురు ముగ్గురే హేమహేమిల్లాంటి నటులు…వాళ్ళనోక్కసారి కలర్ లో చూసి తరించి పోదాం అనిపించింది….అంటే అంతకు ముందు చూడలేదా అని మీరు అడగచ్చు ..ఎంతైనా మాయ బజార్ మాయ బజార్ ఏ కదండీ…ఏంటి ఓడు కృష్ణుడి వేషం కడితే జనం ఎడ్ల బండ్లు కట్టుకుని మైళ్ళ కి మైళ్లు వెళ్లి చుసోచ్చేవల్లంట…సినిమా చూస్తుంటే అలాచేయడం సబబే అనిపిస్తుంది…
ఇంకో విషయం….మనలో మాట…ఈ ముక్క మన కవితక్క కి చెప్పకండే…ఏ కవితక్క??? అమ్మా …యెంత దైర్నం ఉంటే అలా అడుగుతారు…అదేనండి మన తెలంగాణా కవితక్క ….మరి ఇంకా ఈ ముక్క ఎవరు అనలేదో…లేక బుర్రకెక్కలేదో…ఇందులో నటీ నటులు నూటికి తొంభై శాతం సో కాలుడ్ ఆంధ్ర వాళ్ళే…మరి అదుర్స్ సినిమా ఆపిస్తం అని ధుమ్ ధాం డాం డూం అని ఎగిరిన అక్క కీ విషయం ఇంకా తెలిసినట్టు లేదు…
మరి అక్క లెక్క ప్రకారం దీన్ని ఆపాలే గంద….ఇదేమి కిరి కిరి…అంటే మస్తు హుషారు జేస్తే జనం తంతారని ఆగిందో ఏమో…మల్ల తెలంగాణా లో ఈ కాస్ట్ కి మస్తు ఫాన్స్ ఉండారని ఎవ్వరన్న జెప్పిండ్రో….అక్క గిట్ల చప్పుడు జేయక గమ్మునుంది….
కళల కు కళా కారులకు ఎల్లలు ఉండవు…ఉంటాయి ఎల్లలు గీస్తం అనుకుంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట…మన సినిమాలు పాకిస్తాన్ లో కూడా జనం దొంగచాటు గ చూస్తారంట….అక్కడ ఇలాంటి ఛండాలపు ప్రభుత్వం తగలబడింది కాబట్టి…మరి ఖర్మ కాలి రేపు తెలంగాణ ఇలాంటి నాయకత్వం లో వస్తే జనం గిట్ల దొంగతనం గ తెలుగు సినిమాలు చూడాలేమో……ఔ మల్ల…

ఒకటో కృష్ణుడు…రెండో కృష్ణుడు..మూడో…నాలుగో CM

ఫిబ్రవరి 1, 2010
మేఘాలయ లో కాంగ్రెస్ మార్కు రాజకీయం నడుస్తోంది. ఇదేదో పాత మార్కు రాజకీయం కాదండోయ్…రాహుల్ గాంధీ, కొత్త వారసులు , కొత్త రాజకీయం అని ఈ మద్య ఊదర గొట్టిన కాంగ్రెస్ వాళ్ళు,  మేఘాలయ లో 4 గురికి ముఖ్యమంత్రిత్వం కట్ట బెట్టారు…కళ్ళు నులుముకొని చదవక్కరలేదు..నేను కరెక్టే రాసాను..మీరు కరెక్టే చదివారు…సప్పోస్ పర్ సప్పోస్ అని అదేదో సినిమా లో రావు గోపాల రావు అన్నట్టు..వీల్లదేదో నిజమే చేసిపారేసారు..
ఇంకా వివరాలలో కెళ్తే, పార్టీ అద్యక్షుడు లింగ్డో , పాత కాపు లపాంగ్ కి అదే చేత్తో ప్రణాళిక బోర్డు చైర్మన్ కి , ఆర్ధికాభివృద్ధి బోర్డు చైర్మన్  కూడా ముఖ్యమంత్రిత్వం వెలగ బెడతారని ప్రకటన చేసి పారేసారట.మీకీ పాటికి అర్ధం అయ్యేవుంటుంది..ఇందులో చిదంబర రహస్యం ఏమి లేదు…ఆ  4రు CM ల లో 2 రు ఘనత వహించిన కాంగ్రెస్ వాదులు..మరో ఇద్దరు మిత్రపక్షం…అధికారం ఇద్దరిది…ఈ ఒకటో కృష్ణుడు రెండో CM నాటకం చూసి తరించే ఖర్మ జనాలది….అధికారం కోసమో, సర్దుబాట్ల కోసమో మన వాళ్ళు ఇలాంటి నాటకాలు వేయడం కొత్త కాదు కాని…ఇదేదో శ్రుతి మించి రాగాన పడుతున్నట్టు లెదూ…

శిలలపై శిల్పాలు…

జనవరి 28, 2010
విజయనగరసామ్రాజ్యం వైష్ణవ ధర్మోద్ధారణ కై శ్రీ విద్యారన్యుల వారిచే  హిందుత్వ ఉద్ధరణకై సృజించబడినది. హరి హర బుక్క రాయల చే స్తాపింప బడిన ఈ  హిందూ సామ్రాజ్యము దక్షిణాదిన ఏకైక మైనను ౨౦౦ యేండ్ల పైబడి ముస్లిం ఆక్రమణలను ఎదిరించుటలో గొప్ప విజయములు సాదించెను. అందు, కృష్ణదేవ రాయల కాలము స్వర్ణ యుగమని చెప్పవచ్చును.
దేశ భాషలందు తెలుగు లెస్స అనుటయే కాదు తన ఆస్తాన కార్య కలాపాలన్ని తెలుగు లోనే జరిపించిన భాషాభిమాని రాయలు.  భువన విజయము అందలి అష్ట దిగ్గజాలు ఆయన కవి పండిత పక్షపాతానికి నిదర్శనాలు. ఈ నాటికి నిలిచి ఉన్న హంపి శిదిలాలు ఆ కాలములో వారి ఉత్తమాభిరుచి కి నిదర్శనాలు. ఆ మహా నాయకుడు తన సామ్రాజ్యమును యావత్ దక్షినాదిని విస్తరించెను. ఎన్నో ప్రసిద్ధి వహించిన దేవాలయములను ఆయన నిర్మించెను.
 ఒక తెలుగు వాని గా రాయల ౫౦౦ వ పట్టాభిషేక ఉత్సవమున ఆ మహా పురుషునకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలుగు జాతికి తెలుగు భాష కు ఆయన చేసిన సేవ ప్రాత: స్మరణీయము.

ఆముక్త మాల్యద

జనవరి 28, 2010

కృష్ణ దేవరాయలు ప్రభంద కర్త. ఆయన శ్రీకాకులమను ప్రాంతమున పురాతన మండపమున నిద్రించు సమయమున కలలో విష్ణువే ఆయనను తెలుగు న ప్రభంద రచన కు  పూరి గోల్పేనని ప్రసిద్ధి. ఆయన కాలము ప్రభంధ యుగమని ప్రతీతి. శృంగారము ఈ ప్రభంధముల లో ఎక్కువ. ౩౦ పద్యముల లో రాయలు గోదాదేవి సౌందర్యమును వర్ణించెను. విష్ణువు  కై ఆమె విరహమును ఆయన వర్షా కాలమున శీతాకాలమున వర్ణించిన విధము శృంగారమును అతిసయించెను.

గోదా విష్ణు కలయిక ను రాయలు ఆత్మ పరమాత్మ కలయిక వలె వర్ణించెను. ఆమె ప్రేమ ను మనుష్యుని మోక్ష సాధన వలె వర్ణించెను. ఈ కావ్యమున మరియొక ముఖ్య పాత్ర విష్ణు చిత్తుడు. విష్ణువు ఆయనను పాండ్య రాజునకు మోక్ష మార్గమును ఉపదేసించ మనెను. ఈ పాత్ర వలన ఈ కావ్యమునకు విష్ణు చిత్తీయము అని పేరు.
వైష్ణవమును జ్ఞాన మార్గమును ప్రభోదిన్చుటే ఈ ప్రభంధ ముఖ్య ఉద్దేశము., రాయలు కు సంస్కృతము మరియు కన్నడము న యందు కూడా ప్రవేశము కలదు.సంస్కుతమున ఆయన జాంబవతి కళ్యాణమును వ్రాసెను.

దేశ భాషలందు తెలుగు లెస్స

జనవరి 27, 2010

కృష్ణ దేవ రాయల కాలం తెలుగు భాష కు సంస్కృతి కి  స్వర్ణ  యుగం…అష్ట దిగ్గజాలకు ఆలవాలమైన భువనవిజయం ఆయన ఆస్తానం..అష్టదిగ్గజాలు ఎనిమిది దిక్కులను మోసే ఎనిమిది ఏనుగులకు గుర్తు..వారు అల్లసాని పెద్దన,నంది తిమ్మన,  మాదయ్యగారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు రామంభాద్రుడు,  పింగళి సూరన, రామరాజభూషణుడు, మరియు తెనాలి రామకృష్ణుడు. అల్లసాని పెద్దన కు  ‘ఆంధ్ర కవిత పితామహుడు’ అన్న బిరుదు కలదు.మనుచరిత్ర ప్రభంధకర్త.దీని నాయన కృష్ణ దేవరాయలకు అంకితమిచ్చెను. నంది తిమ్మన పారిజాతాపహరణము ను రాయలకంకిత మిచ్చెను. మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్రమును రాసేను.ధూర్జటి కలహాస్తీస్వర మహత్యమును,అయ్యలరాజు రామభద్రుడు రామభుద్యమును రాసెను. పింగళి సూరన రాఘవ పాండవీయమును, భట్టు మూర్తి వసుచారిత్రమును, తెనాలి రామలింగడు పాండురంగ మహత్యమును రాసెను. కృష్ణ దేవరాయలు కూడా గొప్ప కవి…ఆయన తెలుగు సంస్కృత భాషలలో రచనలు చేసెను…మరి ఆ విశేషాలు రేపు మాట్లాడుకుందాం…

జై ప్రకాశం….

జనవరి 25, 2010
ఇందుమూలముగా యావన్మంది ఆంధ్ర తెలంగాణా బ్లోగేర్ లందరికి తెలియజేయుటేమనగా….నేను ప్రత్యెక ప్రకాశం రాష్ట్రము కోసం డిమాండ్ చేస్తున్నాను…ఎందుకనగా..
1 . 1970 లో ఏర్పడ్డ జిల్లా లో ఇంత వరకు ఎటువంటి అభివృద్ధి లేకపోవటం…భాధాకరమైన  విషయం ఏమిటంటే..గుంటూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లాలలో వెనుకబడ్డ ప్రాంతాలనుకలిపి మా జిల్లా ను ఏర్పాటుచేశారు…సరే వాటి అభివృద్ధి కి ఎటువంటి చర్యలు తీసుకోలేదు…
2 . 17626 కే.మీ వైశాల్యం తో ప్రపంచం లో ని ఎన్నో దేశాల కన్నా పెద్ద ప్రాంతం మాది…ఏమి లాభం 60 – 70 శాతం భూమి వ్యవసాయ యోగ్యం కాదు…వాటికి సాగునీరు లేదు..సాగు నీటికి ప్రనాలికయే  లేదు…ఎప్పటికి వస్తుందో తెలీదు..
౩. సాగునీటి విషయం దేవుడెరుగు…జిల్లా ప్రధాన కేంద్రం లో 60 శాతం జనాలకి తాగు నీరే లేదు…వారానికి 2 సార్లు నీళ్ళు వదులుతారు మునిసిపాలిటి..మీ టైం బాలేదా వారానికి ఒకరోజు ను లేదు…ఇంకా మిగత ప్రాంతాల సంగతి స్వామియే శరణం అయ్యప్ప…
4 . మా వాళ్ళ వలసలని పాలమూరు వలసలతో పోల్చవచ్చు….ఇక్కడ ఉద్యోగములు లేవు…ఉద్యోగ వ్యాపార అభివృద్ధి శూన్యము…సర్కారు వారు ఏమైనా చేస్తారా అంటే వాళ్ళ దగ్గర  ఇంత  వరకు ప్రనాలికే లేదు…ఇంకా పని ఎప్పటికి చెయ్యాలే…
5 . 2001 జనాభా లెక్కల ప్రకారం మా జిల్లా జనాభా 3,059,423 ……   కాని ఒక్క విస్వావిద్యాలయము లేదు…..మరి ప్రైవేటు విద్య అందరికి అందుబాటులో లేదు…
6 . ప్రధాన పట్టణాలని మేము చెప్పుకునే వాటికి రవాణా సౌకర్యాలు గగన కుసుమాలె…
7 . granite , వ్యాపార పంటలు అని వికీపీడియా లో కనిపించేవి జనసామాన్యం కి పనికి వచేవి కావు…మోతుబరులు బడ పారిశ్రామిక వేత్తల హక్కుబుక్తాలు…
ఇది ఒక రాయి వేసే ప్రయత్నం కాదు ..ఒకరి ఉద్యమంతో నాకు పోలిక లేదు…కాని అభివృద్ధి ప్రాతిపాదిక పై కొత్త రాష్ట్రాలు ఏర్పడితే మా కు ఒక ప్రత్యెక రాష్ట్రం కావాలి….

తెలుగు వారి తెగులు

జనవరి 22, 2010
ఇది ఎన్నాళ్ళ నుంచో మనసులో ఉన్న మాట…అదేంటో నండి..నేను, ఇంకొక ఆంధ్రా మహానుభావుడు అదేదో దిక్కుమాలిన ఆఫీసు లో పని చేస్తామండి..ఆయన ఎప్పుడు ఎడురుపడ్డా నోరార బావున్నారా అని అడిగామనుకోండి…ఐ అం ఫైన్ హౌ అరె ఉ అనే అంటాడు కాని…బావున్నాను మీరు ఎలా ఉన్నారు అంటే ఆయన సోమ్మేమన్న పోతుందా… సరే మన్ను మాసానాం చుట్టుపక్కల ఎవరైనా తెల్ల తోలోల్లు ఉన్నారా మన భాష లో మాట్లాడుకుంటే విని భాద పడతారు అని చుస్తే  అదేమీ లేక పాయిన అదే తంతు….మేమిద్దరం కార్ లో బైటకు పాయిన అదేమీ దరిద్రమో…అయ్యగారి నోట తెలుగు మాటే కరువు…మనం తెలుగు లో ఏమైనా అడిగిన ఆంగ్లమున దేబిరింతలు…
సరే అయ్యవారేమన్న abcd న అంటే అదీ కాదు…ఆ దిక్కుమాలిన IT బూం లో మూడు ఏళ్ళ క్రితం హైదరాబాద్ నుండి దిగుమతైన సరుకే…అప్పటి దాక అమీర్ పెట్ జంక్షన్ లో పిడత కింద  పప్పు తిన్న శాల్తీ యే….అమెరికా గాలి తగిలి తెలుగు మర్చి పోయారా…లేక మెదడు కేమైనా దెబ్బ తగిలి తెలుగు మర్చిపోయారా అన్నది million డాలర్ ప్రశ్న…
వెనకటికొకాయన అనకాపల్లి నుంచి అమెరికా వచ్చి..ఆవకాయ్ అంటే అదో కొరియన్ కార్ కంపెనీ అన్నాడంట…అలా వుంది మనోల్ల సంగతి…అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంటూ …ఇంకొద్దు లెండి….

అహో ఆంధ్రభోజా……..

జనవరి 18, 2010
ఈ విజయనగర సామ్రాజ్య శిధిలాలలో చిరంజీవి వైనవాయ…ఈ పాట మన ప్రభుత్వం మనసా వాచా కర్మణా నమ్మినట్టుంది…అయినా చిరంజీవులని స్మరించుకోవాలా…వాళ్ళ గురించి ఉత్సవాలు చెయ్యలా అని ఎదురు అడిగితె మనం చేసేదేమీ లేదు…అసలు విషయం…శ్రీ కృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడై ఐదువందల ఏళ్ళు పూర్తి కావొస్తుంది…కర్నాటక ప్రబుత్వం దీనిని ఒక పండుగ లా జరుపడానికి ఒక సంవత్సరం క్రితమే శ్రీకారం చుట్టింది…
రాయల వారి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు…దేశ భాషలందు తెలుగు లెస్స అని నుడివిన భాషాభిమాని,తానే అముక్త మాల్యద లాంటి అద్భుత కావ్యం రాసిన కవి, దక్షిణ భారతదేశ పర్యంతం తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ధీశాలి …మన బ్లాగెరులంతా కలిసి ఆయన గురించి పది రోజులు రాసినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది…ఇంకా గొప్ప విషయం ఏమి టంటే ఘనత వహించిన ఆంధ్ర ప్రభుత్వం దీన్నొక ఉత్సవ  దినం గ అయినా గుర్తించినట్టులేదు…ఆ ఆత్మ గౌరవం, ఈ ప్రాంత పొగరు అని పిచ్చి కూతలు కూసే మన రాజకీయులకు ఇది పట్టినట్టులేదు…
ఇది చాల విచారించవలసిన విషయం…మన వాళ్ళు వుట్టి వెధవాయోలోయి  అన్న కవి ఇలాంటివి ఎన్నిచుసి అలా వాపోయదో తెలీదు…కాని మన వాళ్ళు దీన్ని ప్రతి విషయం లోను అదే పని గ నిరూపిస్తూ ఉంటారు…చరిత్ర మరచిన జాతి కి భవిష్యత్తు లేదు…
కానీ, ఇతరుల పై వేలు చూపే ముందు నా ఇల్లు చక్కబెట్టుకుంటాను, ఈ బ్లాగ్ లో జనవరి 27 28 29 తేదీలలో ఆంధ్రభోజుని విజయాలకు ఆయన తెలుగు భాష కు చేసిన సేవలు స్మరిస్తూ, ఆయనకు నమస్కరిస్తాను…ఆయన పోషించిన తేనెలూరు తెలుగు కు అసలైన వారసుడని పించుకోవడానికి ఉడతాభక్తి తో…..

చేపలు..మనుషులు…

జనవరి 17, 2010
చేపలు కొన్ని విషయాలని నెలల తరబడి గుర్తుంచుకున్తాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోదనలో తేలింది..జాలర్లు తమను బుట్టలో వేసుకునేన్దుకు చేసే ప్రయత్నాలను కనీసం ఏడాది పాటు గుర్తుపెట్టుకొని తమ లోని దోషాలను సవరించుకోవడం ద్వారా మరో మారు తమపై ఆ తరహ దాడి జరగకుండా జాగ్రత్త పరిశోధకులు వహిస్తాయనితెలిపారు..జాలర్లు తమకు ఏరగా వేసే పదార్దాల పట్ల కూడా అప్ప్రమత్తంగ ఉంటాయని, రెండో సారి వలలో పడకుండా తమ ప్రవర్తన మార్చుకున్తాయని ఆయన వివరించారు.
నాకు వెంటనే ఆ శాస్త్రవేత్త కి మెయిలు పంపుదాం అని పించింది…ఆ చేపల మెదళ్ళు ఏమన్నా మనుషులకు అమర్చే అవకాశముందా అని…మన జనాలు గజనిలు కదా…నిన్న జరిగింది ఈ రోజు గుర్తుండదు…మన కళ్ళముందే అన్నిజరుగుతున్నా వెర్రి చేపల్లా కాదు కాదు మనుషుల్లా అదే వలలో పడిపోతుంటారు…అదే జాలర్లని మళ్లీ మళ్లీ నమ్మేస్తుంటారు.. మచ్చుకి రాష్ట్రంలోని ఇప్పటి పరిస్తితి నే తీస్కుందాం….సాద్యా సాధ్యాలు పక్కన పెడితే మొన్నటిదాకా ప్రతి పార్టీ ప్రత్తెలంగాణా ని ప్రత్యెక సమావేశాలు పెట్టి మరీ సమర్దించినదే….దీనికి అలుగు దేశం, మెగా భోజ్యం మినహాయింపు కాదు, మల్ల అదేందో రాత్రికి రాత్రి అందరు ప్లేట్లు  ఫిరాయిన్చేస్తారు….గజనిలు పోలో మని వెనకబడి సమైఖ్యాంద్ర అంటారు…మొన్నటిదాకా ఈ మగానుభావులు ఏమన్నారో ఎవరికి గుర్తుండదు…
ఇక మన సమితి అక్కడేనిమిశానికేమి జరుగునో ఎవరికీ తెలీదు…చింపుతం ఆరేస్తాం…పోస్టర్లు అంటించే వాళ్ళకు కట్ అవుట్ లు పెట్టె వాళ్ళకు ఓవర్ టైం కల్పిస్తాం, అంటారు చేస్తారు…ఒకనాడు అన్నిరకాలు గ వ్యతిరేకించే పార్టీ లతోనే పొత్తు పెట్టుకుంటారు..మల్ల సాయంత్రానికి వాళ్ళనే భాగో గో గో అంటారు…..కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేస్తారు…మళ్ళా ఉన్నట్టుండి మేమోకల్లం ఉన్నాం…అదేప్పట్నించో మాకు అన్యాయం జరుగుతుంది అంటారు…మళ్ళా మన గజలి లు రెడీ…ఉరెస్కోటానికి…ఊర్లకు బస్సులకు నిప్పెట్టదానికి….
బాబ్బాబు ఇదంతా ఎందుక్కాని…మీరు కొంచెం వాకబు చెయ్యండి…ఎమ అర్జెంటు గా ఆ చేపల మెదళ్ళు ఒక 10 కోట్లు ఆర్డర్ చేద్దాం…మన గజనిలను మేల్కొలుపుదాం….

ఒక అందమైన అనుభవం…

జనవరి 17, 2010

వారాంతం…బైట వర్షం…అన్ని పనులు ఆగిపోయాయని అనుకుంటూ మన కూడలి ఓపెన్ చేశా….నిన్నటి బ్లాగ్స్ లో ఎవరో ఒకరు వెన్నల్లో ఆడపిల్ల గురించి రాసారు…వెబ్లింక్ లో ఆ పుస్తకం సంగ్రహించా….వాన సన్నగా కురుస్తోంది…చాలా రోజులైంది వెన్నెల్లో ఆడపిల్ల చదివి…అప్పట్లో యండమూరి ని తెగ తిట్టుకునేవాడ్ని….ఆ కద దుఖాంతం అని…సరే చేసేపని ఏమి లేదు కదా అని మెల్లగా చదవడం స్టార్ట్ చేశా…

యండమూరి మీద నాకో కంప్లైంట్ ఎన్నాళ్ళనుంచో…అదేవిటో ఆయన పుస్తకం చదవటం మొదలుపెడితే ఆపలేము…మిగత అన్ని పనులు తర్వాతే…మా వరండా లో కూర్చున్నా…పక్కింట్లో నుంచి కిషోర్ పాటలు సన్నగా వినిపిస్తున్నాయ్…ఏదో చాల కాలం తర్వాత మంచి స్నేహితుడెవరో కనపడి పలకరించినట్టు అనిపించింది ఆ అనుభవం….వెన్నెల్లో ఆడపిల్ల కొంచెం సూపర్ ఫాస్ట్ త్రిల్లెర్ లాంటిదే…తర్వాత పేజి లో ఏం జరుగుతుందో అన్నట్టే ఉంటుంది…అదేదో మన ముందే జరుతుననట్టు ఆ రేవంత్ కి మనమే ఒక క్లు నో ఇస్తే పోతుంది అనిపిస్తుంది…మనం ఆ చిక్కు ముడులు విప్పక పాయిన తర్వాత పేజి చూసి కనుక్కో గలం కదా 😉
ఈ నవల ఎన్ని రోజుల తర్వాత చదివిన ఏదో కొత్త గానే ఉంటుంది…ఆ పాత్రలు, సంభాషణలు నిత్య నూతనం గానే ఉంటాయి…ఈ ఫోన్ లో అమ్మాయి అబ్బాయి ని ఏడిపించడం అనే కాన్సెప్ట్ చాల సినిమాలలో వచ్చిన రచయితా దీన్ని నడిపిన బిగువు వినుత్నం…ఇక చివరికొస్తే ఈ గొప్ప విషయానికైనా ముగింపు ఉండాల్సిందే…కాని ఈ ముగింపు మనల్ని చాల సేపు ఆలోచింపచేస్తుంది…అంతసేపు తన తెలివి తేటలతో చాకచక్యం తో కధ ను ఎన్నోఊహించని మలుపులు తిప్పిన  రమ్య పాత్ర చివరి మలుపు లో అర్దంతరం గ ముగిసిపోవడం భాదేస్తుంది…..ఈ కధ కు ముగింపు ప్రేక్షకులకే వదిలేస్తే బావుండేదేమో అనిపించింది…ఈ విషయం లో మాత్రం నేను రచయితతో ఎప్పటికి ఏకీభ విన్చలేనేమో….

మంత్రాలకు చింతకాయలు…

జనవరి 15, 2010
నిన్న ఎదాలాపంగా ఈనాడు తిరగేస్తుంటే ఒక వార్త నన్నుకట్టి పడేసింది…కాసేపు ఆలోచించాను…ఇదేలాగాబ్బా అని…ఉహు ఒక పట్టాన కోరుకున పడలేదు….మా రాజకీయ విశ్లేకడుని అనుకునే 😉 ఒక దోస్తుకు ఫోన్ చేసి మరీ వాడి అభిప్రాయం అడిగాను..ఈ వార్త గురించి….వాడు అటు కాని భాషలో ఏదో అన్నాడు…అదిక్కడ ఎందుకు లెండి…మళ్ళా పదిమంది చూడాల్సిన బ్లాగు కదా….
ఇంతకీ విశేషం ఏంటంటే పలానా సినిమాను పలానా చోట ప్రదర్శించకుండా అడ్డుకున్టారట…ఆ కుంటే అని మీరు అడగచు…అడిగే వాడికి బ్లాగర్ లోకువ అన్నట్టు…అదే కదా కిటుకు….అలా చేస్తే ఏమవుతుంది….ఫలానా జనం అడుగుతున్నా ఫలానా చింతకాయ ( అందరు క్షమించాలి…నేనే పక్షము కాదు…ఈ చర్య నాకు అలాగే అనిపించింది) రాలుతుందా అంటే…మంత్రాల మరిడయ్యనో…తంత్రాల మరిడమ్మ నో అడగాల్సిందే…
అయ్యా సినిమాలు కూడా వదలరా…ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము అని ఆంధ్ర దేశం లో ( అదే లెండి తెలంగాణా మరియు ఆంధ్ర ) జనాలకి తిండి పెట్రోలు లేకుండా చేసింది చాలదూ..మీ గోల తట్టుకోలేక ఏదో ఒక సినిమాకు కూడా వెళ్ళకుండా చేస్తే జనం ఎక్కడ చావాలి…జనం ఏమి చూడాలి…ఏమి చెయ్యాలి అనికూడా మీరే డిసైడ్ చేస్తే, కొన్నాళ్ళకి ఈ రోజు మీ ఇంట్లో ఫలానా తెలంగాణా పచ్చి పులుసే తాగండి..లేక పోతే నాలుగు తంతాం అనేటట్టున్నారు….

జంధ్యాల కు హాస్యాంజలి

జనవరి 14, 2010
చిన్నప్పుడెప్పుడో లాగులేస్కునే వయసులో చూసిన సినిమా ” అహ నా పెళ్ళంట”. నాకు జంధ్యాల తో తోలి పరిచయం. విశేషించి అరగుండు నత్తి గోల , కోట పిసినరిత్వానికి పరాకాష్ట…వారిరువురి మద్య పండిన కామెడీ చర్వితచర్వణం. ఆ పాత్రలు ఇంకా గుర్తుకొస్తూనే ఉంటాయ్…వెరైటీ మనుషులు కనపడ్డప్పుడల్లా, జంధ్యాల అలా గుర్తుకొస్తూనే ఉంటాడు…
నేను ఆయన సినిమాలు అన్ని చూసాను…ఒక నాలుగు స్తంభాలాట, ఒక చంటబ్బాయి, ఒక ఆనంద భైరవి..ఒక్కటేమిటి ప్రతీది వందేళ్ళ సినిమా నే…అంటే వందేళ్ళ తర్వాత కూడా ఆ సినిమా ని చూసి ఆహా నా రాజ అనుకోవచ్చు.
జంధ్యాల  గురించి చెప్పడానికి నేను చాల చిన్న వాడ్ని….కానీ, నా దృష్టిలో ఆయన  ఒక సంపూర్ణ కళాకారుడు…మాటలు, స్క్రీన్ప్లే, దర్సకత్వం, నటన ఒకటేమిటి అన్ని రంగాల్లో శహభాష్ అని పించుకున్న వ్యక్తి. నేను ఆయన వీరాభిమాని అని చెప్పడం కాదు కానీ మనుష్యుల స్వభావాలు  ప్రవర్తనలు, వాళ్ళ వెరైటీ చమక్కులు జంధ్యాల మాస్టారు పట్టుకుని మూవీ లో పండించే వాళ్ళు . 
నాకప్పుడప్పుడు అనిపిస్తుంది…అయన ఇంకొన్నాళ్ళు  బ్రతికుంటే ఎన్ని కళా ఖండాలు తీసేవారో. అలాంటి దర్శకులు ఇంకొకరు  ఈ నాటికి తెలుగు దర్శకులలో ఎవరు లేక పోవడం మన దురదృష్టం.